![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/TERRORISTSFF.jpg?fit=700%2C394&ssl=1)
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ ( నేషనల్ ఇన్విస్టిగేషన్ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం కరోనా కల్లోలంతో అతలాకుతలం అవుతుంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం రెచ్చిపోతున్నది. స్థానికంగా ఉండే స్లీప్సెల్లర్స్ సహకారంతో ఉగ్రవాదులు భారీ కుట్రలకు తెగపడుతున్నారు. ఎన్ఐఏ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రకుట్రను భగ్నం చేసింది.