Breaking News

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి.

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. దీంతో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్​లో కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. పెద్దలతో రాయబారం నడిపాడు భర్త. వినలేదు.. ఇక తనతో కలిసి బతికేది లేదంటూ తెగేసి చెప్పంది. పోలీస్ స్టేషన్ ను భర్తను పిలిచి మాట్లాడారు పోలీసులు. ‘నాకు నా భార్య కావాలని భర్త.. ఈ భర్త నాకొద్దంటూ’ భార్య.. ఇదెక్కడి గోల రా బాబూ అనుకుంటూ ఇద్దరిని కౌన్సెలింగ్ కు పిలిచారు పోలీసులు. ఎంత నచ్చచెప్పినా భార్య వినలేదు. దీంతో భర్త లేచి భార్య ముందు నిల్చుని ‘బద్లాపూర్’ సినిమాలోని పాట అందుకున్నాడు. భర్త పాటకు అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. భార్య మాత్రం తన్మయత్వంతో అతని భుజంపై వాలిపోయి కన్నీటి పర్యంతమైంది. వీరిద్దరి ప్రేమవిజయాన్ని వీడియోలో బంధించి ట్విట్టర్ లో షేర్ చేశారు ఐపీఎస్ అధికారి మధుర్ వర్మ. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది.