Breaking News

బొగ్గును దొంగిలిస్తే పీడీయాక్ట్​

సారథిన్యూస్​, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్​ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్​ కమిషనర్​ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్​పై పీడీ యాక్ట్​ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.