Breaking News

బెల్ట్​షాపులను నియంత్రిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలో బెల్ట్​షాపులు విచ్చల విడిగా నడుస్తున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు పేర్కొన్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాప్​లపై ఎక్సైజ్​ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంగళవారం నిజాంపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

కరోనా సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డీ ధర్మారం పీహెచ్ సీ డాక్టర్ ఎలిజిబెత్ రాణి మాట్లాడుతూ.. మండలంలోని 74 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 24 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందని సూచించారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. తహసీల్దార్​ జయరాములు, మండల ప్రత్యేకాధికారి రసూల్, జడ్పీటీసీ విజయ్ కుమార్, వ్యవసాయాధికారి సతీశ్​, విద్యుత్​శాఖ ఏఈ సంతోష్, పలుగ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు.