Breaking News

బెంగాల్​ బీజేపీ అధ్యక్షుడిపై దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్​ వాక్​కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్​ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్​ ఘోష్​ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్​వాక్​కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్​ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి చేశారని దిలీప్​ ఆరోపించారు. తాను మార్నింగ్​ వాక్​కు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించినా వారు భద్రత ఇవ్వలేదని వాపోయారు. బెంగాల్​ టీఎంసీ కార్యకర్తలు చెప్పినట్టు పోలీసులు వింటున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టపాక్​ ముఖర్జీ ఖండించారు. దాడి ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పకొచ్చారు.