![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/DILEEP-GOSHFF.jpg?fit=1280%2C720&ssl=1)
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్ ఘోష్ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్వాక్కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి చేశారని దిలీప్ ఆరోపించారు. తాను మార్నింగ్ వాక్కు వెళుతున్నట్టు పోలీసులకు సమాచారం అందించినా వారు భద్రత ఇవ్వలేదని వాపోయారు. బెంగాల్ టీఎంసీ కార్యకర్తలు చెప్పినట్టు పోలీసులు వింటున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టపాక్ ముఖర్జీ ఖండించారు. దాడి ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పకొచ్చారు.