Breaking News

బీమాకు దరఖాస్తు చేసుకోండి

సారథిన్యూస్, రామాయంపేట: పట్టాపాస్​ పుస్తకాలు ఉన్నవారందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్ కోరారు. జూన్ 16, 2020 వరకు పట్టా పాస్ బుక్ లు వచ్చిన రైతులంతా ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 5697 మంది రైతులు రైతు భీమా కు తమ పేరును నమోదు చేసుకున్నారన్నారు. ఇంకా 437 మంది రైతులు పేర్ల ను నమోదు చేసుకోవాల్సి వారు వెంటనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.