Breaking News

బీజేవైఎం నేతలపై దాడి అప్రజాస్వామికం

బీజేవైఎం నేతలపై దాడి అప్రజాస్వామికం

సారథి న్యూస్, హుస్నాబాద్: బీజేవైఎం రాష్ట్ర నాయకులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టుల చేయాలని మద్దూర్ బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ భిక్షపతి నాయక్ డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా బుధవారం పలువురు బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. అశ్లీల చిత్రాలతో ఇటీవల విడుదలైన ‘డర్టీహరీ’ అనే అశ్లీల చిత్రాన్ని బ్యాన్ చేయాలని నిరసన వ్యక్తంచేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ పై కొందరు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో చిత్రనిర్మాత మై హోమ్ రామేశ్వర్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో హుస్నాబాద్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్, భీమేశ్వర్, సమ్మయ్య, కార్తీక్, ఉదయ్ రెడ్డి, సుధాకర్, విక్రమ్​, శ్రీనివాస్ గౌడ్, మురళి, రమేష్, అజిత్ పాల్గొన్నారు.

దాడికి నిరసనగా మద్దూర్ లో చిత్ర నిర్మాత మై హోమ్ రామేశ్వర్ రావు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ నాయకులు