Breaking News

బీజేపీ నేతల అరెస్ట్ ​అక్రమం

బీజేపీ నేతల అరెస్ట్​అక్రమం

సారథి న్యూస్, బిజినేపల్లి: దుబ్బాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ ​చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే మంత్రి టి.హరీశ్​రావును రంగంలోకి దించి పోలీసులతో రఘునందన్​రావు బంధువుల ఇంటికి పోలీసుల సహాయంతో డబ్బులు పంపించారని విమర్శించారు. మాజీ ఎంపీలు వివేక్, ఏపీ జితేందర్​రెడ్డి అక్రమంగా అరెస్ట్ ​చేశారని ఖండించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలను స్థానిక పోలీసులు అరెస్ట్​చేశారు. కార్యక్రమంలో బిజేపీ మండల నాయకులు వెంకట్రాములు, బాలస్వామి, మల్లెకేడి లక్ష్మీనారాయణ, శివారెడ్డి, తిరుపతయ్య, రాజు, బీజేవైఎం నాయకులు శ్రీరాములు, రాఘవేందర్ గౌడ్, శ్రీను, బాలకృష్ణ, గిరిజన మోర్చా నాయకులు శ్రీనునాయక్, అమర్, మైనార్టీ మోర్చా నాయకులు జాకీర్​హుసేన్, మహమూద్​, నేతలు ప్రవీణ్ రెడ్డి, సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.