![బియ్యం త్వరగా ఇవ్వాలె](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/MDK-2.jpg?fit=1230%2C373&ssl=1)
సారథి న్యూస్, మెదక్: రైస్ మిల్లర్లు ఫుడ్ కార్పొరేషన్ కు బియ్యం త్వరగా సరఫరా చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదేశించారు. వానాకాలం బియ్యం సేకరణపై శనివారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్లిష్టసమయంలోనూ టార్గెట్ మేరకు ధాన్యం సేకరించినందుకు మిల్లర్లను అభినందించారు. బియ్యం కూడా త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాకు అదనంగా కేటాయించిన రా బియ్యం 2,700 టన్నులను బాయిల్డ్ మిల్లర్లు ఈనెల 15 వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అందజేయాలని సూచించారు. మిగతా బాయిల్డ్ బియ్యం 7,888 టన్నులను ఈనెల 25వ తేదీ వరకు ఎఫ్సీఐకి సరఫరా చేయాలని ఆదేశించారు. డీఎస్వో శ్రీనివాస్, అసిస్టెంట్ మేనేజర్ రాజునాయక్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రపాల్ పాల్గొన్నారు.