Breaking News

బలపరీక్షలో నెగ్గిన అశోక్​ గెహ్లాట్

అశోక్​ గెహ్లాట్​ నెగ్గాడు

జైపూర్​: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్​ బలపరీక్షలో నెగ్గారు. శుక్రవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే విశ్వాస పరీక్ష పెట్టారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే అశోక్ గెహ్లాట్​ తనంతట తాను విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. ఇందులో ఆయన నెగ్గారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్​ ఈ నెల 21కి వాయిదా వేశారు. సచిన్ పైలట్ వర్గం పూర్తిగా సహకరించడంతోనే అశోక్ గెహ్లాట్​ విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు.