Breaking News

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

ఫిర్యాదులో మూడో వ్యక్తి జోక్యం వద్దు

సారథి న్యూస్, హుస్నాబాద్: భూతగాదాల్లో ఫిర్యాదు, ప్రతివాది తప్ప మూడో వ్యక్తిపై జోక్యం చేసుకుంటే ఆ వ్యక్తిపై పీడీయాక్డు కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఆదేశించారు. సోమవారం హుస్నాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఉన్నతాధికారుతో చేర్యాల సర్కిల్ ఆఫీసులో పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ, మద్దూర్, చేర్యాల, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులకు శిక్షపడేలా చేయాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారం కేసుల్లో సాంకేతికత ఉపయోగించి నేరస్తుడిని పట్టుకోవాలని సూచించారు. సీసీటీఎస్ఎస్ ప్రాజెక్టు ద్వారా ప్రతి దరఖాస్తులను, ఎఫ్ఐఅర్ లను, సీడీఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సీడీ, చార్జిషీట్, కోర్టు డిస్పోజల్ ఆన్ లైన్ లో ప్రతిరోజు ఎంటర్ చేయలని ఆదేశించారు.

పోలీస్ డివిజన్ పరిధిలో ఎవరైనా భూతగాదాల్లో మూడో వ్యక్తి అనవసరంగా జోక్యం చేసుకుంటే వెంటనే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నం.7901100100, పోలీస్ కమిషనర్ నం.8332921100, డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. దొంగతనం కేసులను ప్రతి అధికారి ఛాలెంజ్ గా తీసుకోవడంతో పాటు నంబర్ ప్లేట్ ఉండి కనబడకుండా స్టైలీష్ గా పేర్లు రాసిన, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, హుస్నాబాద్, చేర్యాల సీఐలు రఘుపతిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు శ్రీధర్, రవి, మోహన్ బాబు, నరేందర్ రెడ్డి, సంపత్, రాజకుమార్ పాల్గొన్నారు.