సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలను తప్పకుండా ఏర్పాటు చేయాలని మెదక్ అడిషనల్కలెక్టర్ నగేష్ కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రూరల్ డెవలప్మెంట్కమిషనర్ రఘునందన్ రావు అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్ నుంచి అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ప్రకృతి వనాలను నిర్మించుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఒక ఎకరాకు తగ్గకుండా స్థల సేకరణ జరిపి వాటిని చదును చేసి వాటిలో ఎరువులు వేసి నేలను సారవంతంగా ఉంచాలని వివరించారు.
పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను చూపించాలని అలాంటి చోట్ల పిల్లలు ఆడుకునేందుకు పార్కులను నిర్మించి అవసరమైన ఆటవస్తువులు, బెంచీలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని వివరించారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.