Breaking News

ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

ప్రతి క్రీడాకారుడికి ధ్యాన్ చంద్ ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ప్రఖ్యాత భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ ను ప్రతి క్రీడాకారుడు ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు కార్పొరేషన్​ కమిషనర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. శనివారం జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అవుట్​డోర్ స్టేడియం వద్ద జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ధ్యాన్​చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధారణ నైపుణ్యం, అద్భుత క్రీడాశక్తి కలిగి ఉంటే సాధారణ కుటుంబంలో జన్మించినా అత్యున్నత శిఖరాలకు సునాయాసంగా చేరుకోవచ్చని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ప్రతిఒక్కరూ తమ నిత్య జీవితంలో క్రీడలు, వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా, ఒలింపిక్ సంఘం నాయకులు పాల్గొన్నారు.