Breaking News

ప్రజలకు దగ్గరవ్వాలి

ప్రజలకు దగ్గరవ్వాలి

సారథి న్యూస్​, కర్నూలు: గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ప్రజలకు మరింత చేరువవుతూ మెరుగైన సేవలు అందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ సూచించారు. మంగళవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వర్కురు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీచేసి పలు రికార్డులను పరిశీలించారు. రైతులకు వన్ బీ, అడంగల్ తదితర సర్టిఫికెట్లు జారీచేస్తూ వచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేస్తున్నారా? అనే విషయాలను సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జేసీ 2 రామసుందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.