Breaking News

పోలీసు కుటుంబాలకు చేయూత

పోలీసు కుటుంబాలకు చేయూత

సారథి న్యూస్​, కర్నూలు: విధి నిర్వహణలో కరోనా బారినపడి మృతిచెందిన ఏడుగురు పోలీస్​ కానిస్టేబుల్​ కుటుంబాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు ఆఫీసులో ఏవో సురేష్ బాబు కార్పస్ ఫండ్, విడో ఫండ్, ఫ్లాగ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఒక్కొక్కరికి కార్పస్ ఫండ్ రూ.లక్ష, విడో ఫండ్ రూ.50వేలు, ఫ్లాగ్ ఫండ్ రూ.25వేల విలువైన చెక్కులను అందజేశారు. ఎంసీ మద్దిలేటి(నందవరం పీఎస్​), ఎంపీ పుల్లారెడ్డి(నంద్యాల 3 టౌన్ పీఎస్), ఎస్ఏ మాలిక్(కర్నూలు 4 టౌన్ పీఎస్​), బి.శ్రీరాములు(మద్దికెర పీఎస్), వి.శివశంకర్ రెడ్డి(గడివేముల పీఎస్​), ఎస్ ఎం బాషా(కర్నూలు పీసీఆర్), పి.శేషిరెడ్డి(ముచ్చుమర్రి పీఎస్​) కుటుంబసభ్యులు చెక్కులు అందుకున్నారు. కార్యక్రమంలో పోలీసు సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.