Breaking News

పెంచిన జీతాల కోసం పోరు

సారథి న్యూస్, రామాయంపేట: పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. నిజాంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వారు ధర్నా చేపట్టారు. జీవో 51ని అడ్డంపెట్టుకొని కార్మికులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత నింగోళ్ల సత్యం, కార్మికులు పాల్గొన్నారు.