Breaking News

పీహెచ్​సీ ఆకస్మిక తనిఖీ

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీని రాష్ట్ర కోవిడ్​ బృందం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. పీహెచ్​సీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఎన్ని పాజిటివ్​ వచ్చాయి తదితర వివరాల గురించి రాష్ట్ర బృందం ఆరా తీసింది. డాక్టర్​ ప్రభావతి నేతృత్వంలోని రాష్ట్ర బృందం పీహెచ్​సీ రికార్డులను పరిశీలించింది. కార్యక్రమంలో పీహెచ్​సీ సిబ్బంది భూమయ్య, రామ్మోహన్​, విజయభాస్కర్​ తదితరులు పాల్గొన్నారు.