Breaking News

పార్కులతో ఆహ్లాదం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్​ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.