Breaking News

పశుగ్రాసం దగ్ధం

సారథి న్యూస్​, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి అనుబంధ గ్రామం మామిడిచెట్టిపల్లి పరిసర పంటపొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని అర కిలోమీటర్​ మేర వ్యాపించాయి. సమీప రైతులకు చెందిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. వ్యవసాయ బోరుబావుల వద్ద కరెంట్​ తీగలు కూడా కాలిబూడిదయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.