Breaking News

పనులు క్వాలిటీగా ఉండాలె

సారథి న్యూస్​, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ పట్టణంలోని జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ కవిత మలోత్​ కవిత మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆర్అండ్​బీ గెస్ట్​హౌస్​, కేజీబీవీ స్కూలు, ఎస్పీ ఆఫీసు పనులను పరిశీలించారు. పనులు క్వాలిటీగా ఉండాలని సూచించారు. వారి వెంట జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​, జడ్పీ చైర్​పర్సన్​ ఆంగోతు బిందు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.