Breaking News

‘పద్మ’ అవార్డుల దరఖాస్తుకు గడువు పొడిగింపు

‘పద్మ’ అవార్డుల దరఖాస్తుకు గడువు పొడిగింపు

సారథి న్యూస్, హైదరాబాద్: వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించివారినికి ఇచ్చే పద్మ అవార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్​15వ తేదీ వరకు పెంచింది. వివిధ రంగాల్లో విశేషంగా కృషిచేసిన వారికి గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ పురస్కారాలను ఇవ్వనుంది. ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది.