Breaking News

పట్టాలెక్కనున్న రుద్ర

ధనుష్ స్వీయ దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ హీరోలుగా ‘రుద్ర’ సినిమా నిర్మించాలని గత రెండేళ్లుగా అనుకుంటున్నారు. 15వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ డ్రామాగా స్క్రిప్టు కూడా సిద్ధమైంది. అదితీ రావు హైదరీని హీరోయిన్​గా కూడా ఎంపిక చేసుకున్నారు. కానీ బడ్జెట్ విషయంలో తేడా రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయిందని పుకార్లు వచ్చాయి. అది కొంత నిజమే అయినా లేటెస్ట్​గా ధనుష్ పట్టువీడని విక్రమార్కుడిలా కథలో మార్పులు చేర్పులూ చేసి బడ్జెట్​కు అనుకూలంగా మరో ప్రొడ్యూసర్​తో ఈ సినిమా పట్టాలెక్కించనున్నాడట.
ప్రస్తుతం బాలీవుడ్​లో భారీ క్యాస్టింగ్​తో పాన్ ఇండియా మూవీగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నటిస్తున్న అక్కినేని త్వరలోనే ఈ సినిమా షూటింగ్​కు అటెండ్ కానున్నాడట. భారీ చారిత్రాత్మక చిత్రంగా ‘రుద్ర’ను ధనుష్ తెరకెక్కించేందుకు గత రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న ఈ సినిమాకు హీరోగా మొదట రజినీకాంత్ ను అనుకున్నారట. కానీ కథ పరంగా నాగార్జున సూటవుతాడని నాగ్​ను ఎంచుకోవడం జరిగిందట. ఇప్పటివరకూ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ఈసారి మాత్రం ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ సినిమాను స్పీడ్ గా పూర్తి చేయాలని ధనుష్ భావిస్తున్నాడట. త్వరలోనే ధనుష్ నుండి రుద్రకు సంబంధించిన అప్ డేట్ వస్తుందనుకుంటున్నారంతా.