Breaking News

పంజాబ్​ మంత్రికి కరోనా

చంఢీగర్​: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్​ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్​ మంత్రి రాజిందర్​ సింగ్​ బజ్వాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యుల శాంపిల్స్​ను అధికారులు సేకరించారు. కాగా పంజాబ్​లో మంగళవారం నాటికి 8,551 కరోనా కేసులు నమోదుకాగా ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోయారు.