Breaking News

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ పరిశీలన

సారథి న్యూస్, హైదరాబాద్: నగర నడిబొడ్డున పంజాగుట్టలో రూ.23కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆదివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్,

మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లాక్డౌన్ తో కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులు, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ను మంత్రి అభినందించారు. ఆధునిక యంత్రాలతో మరో నెలరోజుల్లో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు ఇప్పటి వరకు 50శాతం పూర్తయినట్లు జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్ వివ‌రించారు. నిత్యం ర‌ద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని చెప్పారు. వారి వెంట  స్థానిక కార్పొరేటర్ మన్నె కవిత గోవర్ధన్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.