Breaking News

నిర్మాతగా మారనున్న క్రిష్​

ప్రముఖ దర్శకుడు క్రిష్​ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఓ నిర్మాణసంస్థను ప్రారంభించనున్నారని టాక్​.
ఓ వైపు దర్శకత్వం వహిస్తూనే సినిమాలు నిర్మించనున్నట్టు టాక్​. లాక్‌డౌన్ సమయంలో పలువురు దర్శకులు చెప్పిన కథలు క్రిష్​ విన్నాడట. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డికి తన నిర్మాణసంస్థలో దర్శకుడిగా తొలిచాన్స్​ ఇస్తాడట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాబోతోందట. ఇటీవల కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో విజయం అందుకున్న దర్శకుడు రవికాంత్ కూడా క్రిష్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడట.