Breaking News

నితిన్​ తో రెండోసారి

‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కీర్తిసురేష్. అప్పటి నుంచి తన సినిమాలన్నీ ఆచితూచి ఎన్నుకుంటోంది. ప్రస్తుతం కీర్తి చేతిలో చాలా మంచి సినిమాలే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్​ లో అజయ్ దేవగణ్ హీరోగా రవీంద్రనాథ్ శర్శ డైరెక్షన్​ లో ‘మైదాన్’ స్పోర్ట్స్ బయోపిక్ ఒకటి, తెలుగులో నితిన్​ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్లక్ సఖి’, నరేంద్ర నాథ్ డైరెక్షన్​లో ‘మిస్ ఇండియా’ సినిమాలు.. తమిళంలో సూపర్​ స్టార్​ రజనీకాంత్ మూవీ ‘అన్నాత్త’, ‘పెంగ్విన్’ సినిమాలు కాగా మలయాళంలో ‘మరక్కర్’ సినిమా కూడా చేస్తోంది.

ఇవి కాక మళ్లీ నితిన్​ తో కలిసి మరో సినిమా చేస్తోందట. ‘రంగ్ దే’ సినిమా తర్వాత నితిన్ వరుసగా మూడు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందులో కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ ఒకటి. ఈ సినిమాలో హీరోయిన్​ గా కీర్తిని సంప్రదించగా సై అందట. అంతేకాదు ఈ సినిమాను రెండు పార్ట్​ లుగా తీస్తారట. ఇకపై వరుస ఆఫర్లతో కీర్తి ఫుల్ బిజీ అయిపోనుంది.