![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/LOCKDOWN-NIJAMPETff.jpg?fit=700%2C393&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలో
నిజాంపేట మండల కేంద్రంలో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడగించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అనూష మాట్లాడుతూ.. కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారికి రూ. 5000 జరిమానా విధిస్తున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు షాప్ యజమానులకు జరిమానా విధించినట్టు ఆమె పేర్కొన్నారు.