Breaking News

నిఘా నీడలో..

సారథిన్యూస్​, ఖమ్మం : మావోయిస్టుల కదలికల నేఫథ్యంలో.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురంలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ గ్రీన్​ఫీల్డ్​ సర్వే నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గన్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, కల్లూరు ఏసీపీ వెంకటేశ్​, వైరా సీఐ వసంత కుమార్, తల్లాడ వైరా, కల్లూరు ఎస్సైలు తిరుపతిరెడ్డి, సురేశ్​, రఫీ ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు బలగాలతో పొలాల్లో చేల గట్లపై బురదలో నడుచుకుంటూ సర్వేకు బందోబస్తు కల్పిస్తున్నారు. కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, తల్లాడ తహసీల్దార్​ గంట శ్రీలత సర్వేను పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలో అలజడులకు తావులేకుండా ప్రశాంతంగా సర్వే జరుగుతుంది. గ్రామస్థులంతా సర్వేకు సహకరిస్తున్నారని పోలీసులు చెప్పారు.