సారథి న్యూస్, నారాయణఖేడ్: మెదక్ జిల్లా కంగ్టి మండలంలోని నాగన్పల్లిలో గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి రూ.1.2 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. గురువారం కంగ్టి ఎస్ఐ అబ్ధుల్ రఫిక్ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులే సొంత ఖర్చుతో కెమెరాలు ఏర్పరుచుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ, బీజేపీ మండలాధ్యక్షుడు సిద్దారెడ్డి, ఎంపీటీసీ, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.
- September 17, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CC CAMERAS
- CMKCR
- HYDERABAD
- KTR
- POLICE
- SARPANCH
- TELANGANA
- VILLAGE
- కేటీఆర్
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on నిఘానీడలో నాగన్పల్లి