Breaking News

నాగర్​కర్నూల్​ జిల్లాలో 13 కొత్తకేసులు

నాగర్​కర్నూల్​లో విస్తరిస్తున్న కరోనా

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్​వో సుధాకర్​ లాల్​ తెలిపారు. నాగర్​కర్నూల్​ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. నాగర్​కర్నూల్​ మండలం పెద్దాపూర్​కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్​లోని ఓ దవాఖానలో డయాలసిస్​ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం నర్సాయిపల్లికి చెందిన ఉపాధ్యాయుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొల్లాపూర్ ఎస్​బీఐలో పనిచేసే క్యాషియర్ కు, అటెండర్ కు కరోనా సోకింది.