Breaking News

ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

ధైర్యంగా ఉండండి.. ఆందోళన వద్దు

  • మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ భరోసా
  • మున్నేరు ముంపు పునరావాస కేంద్రాల పరిశీలన

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రవహిస్తున్న మున్నేరు కాల్వ ఒడ్డు ముంపు ప్రాంతవాసులకు నయాబజార్ స్కూలు​, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం సందర్శించారు. నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మున్నేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనావేసి నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ జయంతికి సూచించారు. ఖమ్మం జిల్లాలో చెరువులు, కాల్వలు పొంగి ప్రహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తచర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ సూచించారు.

మున్నేరులో వరద ఉధృతిని పరిశీలిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​