Breaking News

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

సారథి న్యూస్​, మెదక్​: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజాసమస్యలు, ఈ ప్రాంత సాగునీటి రంగంపై విశేష అనుభవం ఉంది. 2004లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పాత దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. సీఎం కేసీఆర్ సహకారంతో దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపించారు. నిరంతరం ప్రజలతో కలిసి కష్టసుఖాల్లో భాగస్వాములు అయ్యేవారు.

పలువురి సంతాపం
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతికి సీఎం కె.చంద్రశేఖర్​రావు, మంత్రులు కేటీఆర్​, టి.హరీశ్​రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్​నేతలు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు సంతాపం తెలిపారు.