![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/DEEPIKA-WATSAPPGG-1.jpg?fit=700%2C394&ssl=1)
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రియా చక్రవర్తి 78 మంది పేర్లు చెప్పినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, నమ్రతా శిరోద్కర్ పేర్లు బయటకు వచ్చాయి. వీరందరికీ ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. శుక్రవారం రకుల్ ప్రీత్సింగ్ ఎన్సీబీ ( నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) ఎదుట హాజరైంది. మరోవైపు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ను శుక్రవారం ఎన్సీబీ ప్రశ్నించింది. ఆమె ఎన్సీబీకి పలు కీలక వివరాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తాను దీపికా, సుశాంత్సింగ్ మేనేజర్ జయ సాహా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నామని కరిష్మా ఎన్సీబీకి చెప్పిందట. అయితే ఈ గ్రూప్కు దీపికానే అడ్మిన్గా ఉండేదని.. ఈ గ్రూప్ కేవలం డ్రగ్స్ కోసమే పెట్టుకున్నామని ఆమె ఎన్సీబీకి చెప్పిందని సమాచారం. దీపికా తరుచూ డ్రగ్స్గురించి అడిగేదని కరిష్మా అధికారులకు చెప్పిందట. ఈ మేరకు పలు జాతీయమీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరంతా కలిసి 2017 లో చేసిన చాట్ కు సంబంధించిన పలు వివరాలు ఆమె అధికారులకు వెల్లడించినట్టు సమాచారం. శనివారం దీపికా పదుకొనే.. ఆమె మేనేజర్ కరిష్మా .. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. వీరిద్దరిని ఎదురెదురుగా కూర్చొబెట్టి నిజాలు రాబట్టనున్నట్టు టాక్. ప్రస్తుతం సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, సుశాంత్ మేనేజర్ జయసాహో, దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాశ్ చెప్పిన వివరాల ప్రకారం విచారణ సాగుతున్నది. అయితే ఈ కేసులో మరికొందరు ప్రముఖులు తెరమీదకు రావొచ్చని సమాచారం.