సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) కొత్తగా 1,802 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,42,771కు చేరింది. తాజాగా 9 మంది కోవిడ్ వ్యాధిబారినపడి చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 895కు చేరింది. తాజాగా 2,711 మంది కోవిడ్ పేషంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,10,241కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్కేసుల సంఖ్య 31,635 ఉంది. దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 77.25శాతం కాగా, తెలంగాణలో కరోనా రికవరీ రేటు 77.2 శాతంగా నమోదైంది. ఇక దేశంలో కరోనా మరణాల రేటు 1.70 శాతం ఉంది. 24 గంటల్లో 36,593 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 17,66,982 శాంపిల్ టెస్టులు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.
- September 7, 2020
- Top News
- CARONA
- POSITIVE CASES
- TELANGANA
- కరోనా
- కోవిడ్19
- తెలంగాణ
- పాజిటివ్కేసులు
- Comments Off on తెలంగాణలో 1,802 కరోనా కేసులు