Breaking News

తెలంగాణలో 1,597 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,597 కరోనా పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 386 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా పాజిటివ్​కేసుల సంఖ్య 39,342 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,08,666 మందికి మెడికల్​టెస్టులు చేశారు. జిల్లాల వారీగా.. జీహెచ్ఎంసీ 796, మేడ్చల్​115, సంగారెడ్డి 73, కామారెడ్డి 33, వరంగల్​అర్బన్​44, పెద్దపల్లి 20, మెదక్​18, మహబూబ్ నగర్​21, మంచిర్యాల 26, నల్లగొండ 58, సూర్యాపేట జిల్లాలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.