Breaking News

తిరుమలలో పరిమిత దర్శనాలే

తిరుమలలో పరిమిత దర్శనాలే

– టీటీడీ చైర్మన్ ఎస్ వీ సుబ్బారెడ్డి

సారథి న్యూస్, అనంతపురం: తిరుమలలో ఒకేసారి  లక్షల మంది దర్శనాలు సాధ్యం కాదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి అన్నారు.

లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పిన ఆయన లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్యూ లైన్లలో మార్పులు ఉంటాయన్నారు. భక్తులకు మాస్క్​ ​లు, శానిటైజర్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు.

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఆయా ప్రభుత్వాల సూచన మేరకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పారు.