![డెక్సామెథసోన్కు పర్మిషన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/Dexamethasone-FINAL.jpg?fit=673%2C372&ssl=1)
న్యూఢిల్లీ: కరోనా పేషంట్లకు ట్రీట్మెంట్ చేసేందుకు లోకాస్ట్ స్టిరాయిడ్ డ్రగ్ డెక్సామెథసోన్ ను వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ రివైజ్డ్ వర్షన్ ఆఫ్ ‘క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్: కోవిడ్ –19’ డాక్యుమెంట్ను పబ్లిష్ చేసింది. వ్యాధి, తీవ్ర లక్షణాలతో బాధపడేవారికి ప్రాణవాయువు అవసరం, అధికా ఇన్ఫ్లమేటరీ (మంట) ఉన్నవారికి డెక్సామెథసోన్ వాడొచ్చని తెలిపింది. డెక్సామెథసోన్ స్టెరాయిడ్ను 1960 నుంచి ఉపయోగిస్తున్నారు. ఇన్ఫ్లమేషన్ లక్షణాలను తగ్గించేందుకు, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్లలో దీన్ని వాడుతారు. 1977లో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చింది.