Breaking News

ట్రంప్​ మాస్క్​ పెట్టుకుంది అందుకేనా?

మాస్క్​ ధరించి దవాఖాన సందర్శనకు వచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్​

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తొలిసారి మాస్క్​ ధరించి ప్రత్యక్షమయ్యాడు. తాజాగా వాషింగ్టన్​ సమీపంలోని వాల్టర్​రీడ్​ మిలటరీ దవాఖానను సందర్శించిన ఆయన మాస్కును ధరించాడు. అమెరికాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్​ మాస్క్​ ధరించలేదు. మాస్క్​ ఎందుకు పెట్టుకోరంటూ మీడియా ప్రశ్నించిన ప్రతిసారి.. ఎదురు దాడికి దిగేవారు. ఈ క్రమంలో తొలిసారిగా మాస్క్​ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు మాస్క్​ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. దేశాధ్యక్షుడే మాస్క్​ ధరించకపోతే.. సాధారణ ప్రజలు కూడా అదే ఫాలోఅవుతారని వారు విమర్శిస్తున్నారు. అమెరికాలో కరోనావ్యాప్తికి దేశాధ్యక్షుడు పరోక్షంగా తోడ్పడుతున్నారని వారు విమర్శించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో, రాజకీయ సలహాదారుల సూచనమేరకు ట్రంప్​ మాస్క్​ ధరించినట్టు సమాచారం.