![మాస్క్ ధరించి దవాఖాన సందర్శనకు వచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/TRUMP-MASKff.jpg?fit=968%2C681&ssl=1)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాస్క్ ధరించి ప్రత్యక్షమయ్యాడు. తాజాగా వాషింగ్టన్ సమీపంలోని వాల్టర్రీడ్ మిలటరీ దవాఖానను సందర్శించిన ఆయన మాస్కును ధరించాడు. అమెరికాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్ మాస్క్ ధరించలేదు. మాస్క్ ఎందుకు పెట్టుకోరంటూ మీడియా ప్రశ్నించిన ప్రతిసారి.. ఎదురు దాడికి దిగేవారు. ఈ క్రమంలో తొలిసారిగా మాస్క్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అమెరికాలో త్వరలో ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు మాస్క్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. దేశాధ్యక్షుడే మాస్క్ ధరించకపోతే.. సాధారణ ప్రజలు కూడా అదే ఫాలోఅవుతారని వారు విమర్శిస్తున్నారు. అమెరికాలో కరోనావ్యాప్తికి దేశాధ్యక్షుడు పరోక్షంగా తోడ్పడుతున్నారని వారు విమర్శించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో, రాజకీయ సలహాదారుల సూచనమేరకు ట్రంప్ మాస్క్ ధరించినట్టు సమాచారం.