Breaking News

టీచర్ల మహాధర్నా సక్సెస్​

టీచర్ల మహాధర్నా సక్సెస్​

సారథి న్యూస్, ములుగు: విద్యారంగ సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జాక్టో, యూఎస్​పీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందని ములుగు జిల్లా జాక్టో చైర్మన్ ఏళ్ల మధుసూదన్ తెలిపారు. కార్యక్రమానికి ములుగు జిల్లాలోని 9 మండలాల నుంచి తరలివెళ్లినట్లు తెలిపారు. ధర్నాలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం కృష్ణయ్య, ఎస్టీయూ ములుగు మండలాధ్యక్షుడు గన్నోజు ప్రసాద్, వెంకటాపూర్ అధ్యక్షుడు బండారి జగదీశ్, రామారావు, రమణయ్య, శేషాచలం, గోవర్ధన్, భాస్కర్, మంగపేట మండల బాధ్యులు జుమ్య లాల్, గోవిందరావుపేట బాధ్యులు పోరిక రాజన్న, ములుగూరి రమేష్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న టీచర్లు