Breaking News

జోనల్‌ కమిషనర్‌కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో టెస్టుల సంఖ్య పెంచడంతో కరోనా కేసులూ భారీగా నమోదవుతున్నాయి. గురువారం ఏకంగా 352 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో 300 మందికిపైగా పాజిటివ్‌ నమోదవడం ఇదే తొలిసారి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 303 కేసులు వచ్చాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌కు వైరస్‌ సోకింది. 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో నివాసం ఉండే సదరు ఐఏఎస్‌ అధికారిణి.. ప్రస్తుతం ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నట్లు కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు.