Breaking News

జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం తెలిపారు. అదే విధంగా ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఉండవని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు.
ఇది టైం టేబుల్​
జులై 10న ఫస్ట్​ లాంగ్వేజ్​ ఎగ్జామ్​ ఉంటుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అలాగే 11న సెకండ్​ లాంగ్వేజ్​, 12న ఇంగ్లిష్​, 13న మ్యాథ్స్​, 14న జనరల్​ సైన్స్​, 15 సోషల్​ స్టడీస్​, 16న ఒకేషనల్​ ఎగ్జామ్​ ఉంటుంది.