Breaking News

జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​
  • ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు
  • ప్రతిపేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.

సారథి న్యూస్, అమరావతి: పదవ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌నేపథ్యంలో 11 పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూనే జులై 10 నుంచి 15వ తేదీ వరకు ఎగ్జామ్స్​ నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతి ఎగ్జామ్​ ఉదయం 9.30 నుంచి 12.45 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

  • ఇది టైం టేబుల్​
  • జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్
  • 11న సెకండ్
  • 12న ఇంగ్లిష్​
  • 13న మ్యాథ్స్
  • 14న జనరల్ సైన్స్
  • 15న సోషల్ స్టడీస్‌