![జులై 10 నుంచి టెన్త్ ఎగ్జామ్స్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/tenth.jpg?fit=1280%2C720&ssl=1)
- ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కీలక నిర్ణయం
- కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు
- ప్రతిపేపర్కు 100 మార్కులు ఉంటాయి.
సారథి న్యూస్, అమరావతి: పదవ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్నేపథ్యంలో 11 పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూనే జులై 10 నుంచి 15వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ప్రతి పేపర్కు 100 మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతి ఎగ్జామ్ ఉదయం 9.30 నుంచి 12.45 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
- ఇది టైం టేబుల్
- జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్
- 11న సెకండ్
- 12న ఇంగ్లిష్
- 13న మ్యాథ్స్
- 14న జనరల్ సైన్స్
- 15న సోషల్ స్టడీస్