Breaking News

జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయం

సారథిన్యూస్​, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్​రామ్​ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్​ చైర్మన్​ ఉదయ్​కుమార్​ పేర్కొన్నారు. జగ్జీవన్​ రామ్​ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్​రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్​రామ్​ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్​, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి, కార్పొరేటర్ మహంకాళి స్వామి, ఎమ్మార్పీఎస్​ నాయకులు రాచపల్లి రవికుమార్. మిట్టపల్లి అంకుష్, గొర్రె నరసింహారావు, గొర్రె శంకర్, రవి, పర్వతాలు, రాజేందర్, కనుకుంట్ల రమేష్, సదయ్య, వీరయ్య, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి పాల్గొన్నారు.