Breaking News

చైనా కవ్వింపును ఉపేక్షించబోం

సారథి న్యూస్, హైదరాబాద్: : భారత్‌ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి‌ ఆర్కేఎస్​ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు. చైనాకు దీటైన సమాధానం చెప్పే సత్తా భారత్​ వద్ద ఉన్నదన్నారు. శనివారం హైదరాబాద్‌ సమీపంలోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. చైనా ఆగడాలను ఎల్లప్పుడూ తిప్పుకొడుతున్న భారత జవాన్ల పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.