![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/FISHHHHHFF.jpg?fit=700%2C467&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: చేపల వేట ప్రస్తుతం కొందరు యువకులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా రామడగు మండలంలోని వివిధ గ్రామాల్లోని వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. లక్ష్మీపూర్ పంపు హౌస్ గ్రావిటీ కెనాల్ గేట్లు ఎత్తటంతో, చేపల వేట జోరుగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 నుండి 100 మంది యువకులు ఇక్కడ చేపలు పడుతున్నారు. తెల్ల చేపలు. అర్జులు, బొచ్చెలు, రవ్వులు, గురిజెలు, జెల్లలు, బొమ్మెలు తదితర చేపలు వారికి దొరుకుతున్నాయి. అనంతరం వాటిని మార్కెట్లో విక్రయించి లాభాలు పొందుతున్నారు యువత.