అబుదాబి: ఐపీఎల్-13 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్మెన్ సౌరభ్ తివారీ 42(31), డికాక్ 33(20), పొలార్డ్18(14) పరుగులతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు లుంగీ ఎన్గిడి 3 వికెట్లు, చాహర్ 2, రవీంద్రజడేజా 2 వికెట్ల చొప్పున తీశారు. శ్యాంకరణ్, పియూష్చావ్లా చెరో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ షేన్ వాట్సన్, మురళి విజయ్ ఇన్సింగ్స్ను దూకుడుగా ఆరంభించబోయి వికెట్ల ముందు బోల్తాపడ్డారు. స్టార్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు మెరుపు బ్యాటింగ్తో 71(48) పరుగులు చేశాడు. కరణ్ 18(5), డుప్లిసెస్ 55(42) పరుగులతో 19.2 ఓవర్లలో 166 పరుగులతో విజయాన్ని అందించారు.
- September 19, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CHENNAISUPERKINGS
- CSK
- DHONI
- MUMBAIINDIANS
- ROHITHSHARMA
- చెన్నై సూపర్కింగ్స్
- ధోనీ
- ముంబై ఇండియన్స్
- రోహిత్శర్మ
- సీఎస్కే
- Comments Off on చెన్నై ‘సూపర్’ విక్టరీ