Breaking News

‘చిరుత’ పిల్లకు బంపరాఫర్

‘చిరుత’పిల్లకు బంఫర్​ ఆఫర్​

పూరీ జగన్నాథ్ సినిమా ‘చిరుత’లో నటించింది నేహా శర్మ. రామ్​ చరణ్ కు అది మొదటి సినిమానే అయినా తన ఫస్ట్ మూవీ మెగా హీరోతోనే జోడి కట్టింది నేహా. మొదటి సినిమాలోనే బోల్డ్ గా నటించిన నేహా నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో నేహాకు టాలీవుడ్​ లో తిరుగుండదు అనుకున్నారంతా. కానీ అమ్మడి విషయంలో అది తారుమారు అయింది. తెలుగులో ఆశించిన ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. కానీ అక్కడ కూడా నేహాకు చుక్కెదురైంది. ఇండస్ట్రీలో అనుకున్న స్థాయిలో క్లిక్ అవకపోయినా ఇప్పుడో బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నేహా నటించనుంది. అయితే నేహా వెండితెర మీద మెరిసి రెండేళ్లు దాటుతోంది.

2017లో మలయాళ డైరెక్టర్ బిజో నంబియార్ హీరో దుల్కర్ సల్మాన్ తో తీసిన ‘సోలో’ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం అదే దర్శకుడితో రెండో సినిమా ‘తైష్’ లో నటిస్తున్న నేహాను మరో లక్కీ చాన్స్ వరించింది. జీ స్టూడియోస్ సమర్పిస్తున్న హంగేరియన్ మూవీని రీమేక్ చేయనున్న డైరెక్టర్ ఇంద్రజిత్ నట్టోజి ప్రాజెక్టులో లీడ్ క్యారెక్టర్ చాన్స్ పట్టేసింది నేహా. ‘లిజా’ హంగేరియన్ మూవీని ‘అఫత్ ఏ ఇష్క్’గా బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నట్టు ఇంద్రజిత్ నట్టోజీ తెలిపారు. రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటించాల్సి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటోంది నేహా. అతిత్వరలోనే ఈ సినిమా జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానుంది. ఈ సినిమాతో నేహా కెరీర్ మలుపు తిరగనుందో లేదో చూడాలి.