Breaking News

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి

ఘనంగా వైఎస్సార్​వర్ధంతి

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో వైఎస్సార్​సీపీ టౌన్​అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్​విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మద్దూర్ నగర్ లో శరణాలయానికి టీవీ, మంచాలు, ఫ్యాన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, వైఎస్సార్​సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య, వైఎస్సార్​సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీహెచ్​మద్దయ్య బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రియల్ టైం నాగరాజు యాదవ్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు కటారి సురేష్ కుమార్, యువజన విభాగపు నగర అధ్యక్షుడు సోంపల్లి కృష్ణకాంత్ రెడ్డి పాల్గొన్నారు.