Breaking News

గ్యాంగ్​స్టర్​ వికాస్​​దూబే అరెస్ట్​

కాన్పూర్​: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్​ చేశారు. మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో ఈ క్రిమినల్​ పోలీసులకు చిక్కాడు. వికాస్​దూబే కోసం మూడు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలించారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వికాస్​దూబే ఉజ్జయినీలోని ఆలయం సమీపంలో కనిపించాడు. గమనించిన ఓ దుకాణ యజమాని పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గత శుక్రవారం వికాస్​దూబేను అరెస్ట్​ చేసేందుకు వెళ్లిన ఎనిమిది పోలీసులను అతడి అనుచరులు కాల్చిపంపిన విషయం తెలిసిందే. వికాస్​ దూబేపై ప్రస్తుతం రూ. 5 లక్షల రివార్డు ఉంది. ఇప్పటికే వికాస్ ​దూబేకు చెందిన ఇద్దరు అనుచరులు పోలీసులు ఎన్​కౌంటర్​లో చనిపోయిన విషయం తెలిసిందే..