Breaking News

గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!

గోడలపై ఫొటోలు ఎక్కాల్సిందే..!


  • యూపీలో లైంగికదాడి నిందితులకు కొత్త శిక్ష

లక్నో: దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ లో నేరాలూ అదే స్థాయిలో ఉంటాయి. నేరాలకు సంబంధించి ఏ రిపోర్టు చూసినా దాదాపు ఆ రాష్ట్రానిదే అగ్రస్థానం. ఇక మహిళలు, బాలికలపై అత్యాచారాలైతే అక్కడ నిత్యకృత్యమయ్యాయి. సాక్షాత్తూ పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలూ సైతం ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇకనుంచి మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారం చేసేవారికి అక్కడి పోలేసులు కొత్త తరహా శిక్ష వేయబోతున్నారు. నిందితుల ఫొటోలను రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, ప్రధాన కూడళ్లలో అతికించనున్నారు. ఇలా చేస్తే వారి గురించి జనాలకు తెలిసి ఛీత్కారాలకు గురికాక తప్పదు. ఇలాంటి చర్యలతో ఆడవారి వైపు చూడాలంటేనే నేరగాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని పోలీసులు అంటున్నారు. ‘ఆపరేషన్ దురాచారి’ పేరిట ఈ కార్యక్రమం చేపట్టాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. మహిళల భద్రత కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.